గుమ్మలక్ష్మిపురంలో నిరసన చేపట్టిన ఎస్ఎఫ్ఐ

గుమ్మలక్ష్మిపురంలో నిరసన చేపట్టిన ఎస్ఎఫ్ఐ

గుమ్మలక్ష్మిపురంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించవద్దని ఎస్ఎఫ్ఐ నిరసన తెలిపింది. స్థానిక పోస్టుమెట్రిక్ బాలుర వసతి గృహంలో జరిగిన కార్యక్రమంలో మండల కార్యదర్శి గంగారావు మాట్లాడుతూ.. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు వేడి ఆహారం అందకపోవడంతో పాటు వంట కార్మికులు ఉపాధి కోల్పోతారని అన్నారు.