రేపు జిల్లా నేతలతో జగన్ సమావేశం.!

సత్యసాయి: మడకశిర, రొద్దం మండల వైసీపీ ప్రజాప్రతినిధులతో రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను సమావేశానికి ఆహ్వనించారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.