వెంకయ్యనాయుడుకు కాణిపాకం ప్రసాదాలు అందజేత

వెంకయ్యనాయుడుకు కాణిపాకం ప్రసాదాలు అందజేత

CTR: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే మురళీమోహన్, ఛైర్మన్ మణినాయుడు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వేదపండితులు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వచనాలు అందించారు. ఆలయ సంప్రదాయాలను వివరించిన వారు, స్వామివారి కృపతో దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.