'కార్మిక పోరాటాలకు నియంతలు గద్దె దిగాల్సిందే'
BHNG: కార్మిక వర్గం సంఘటితంగా తిరగబడితే ఎంతటి నియంతలైనా గద్దె దిగాల్సిందేనని CITU రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య అన్నారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామలను చూస్తే అర్ధం అవుతుందని ఉద్ఘాటించారు. శనివారం రామన్నపేటలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో CITU జిల్లా 4వ మహాసభలలో ఆయన పాల్గొని మాట్లాడారు.