విద్యుత్ సమస్యలు పరిష్కరించండి: ఆదిమూలం
TPT: సత్యవేడు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు తక్షణం పరిష్కరించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విద్యుత్ శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఈ లైన కరుణాకర్, వి.చంద్రశేఖర్లను కోరారు. ఇందులో భాగంగా మంగళవారం ఎస్ఈలకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విద్యుత్ సరఫరా అందించాలని అధికారులను కోరారు.