'2027 జనాభా లెక్కలు సమగ్రంగా నిర్వహించాలి'
ప్రకాశం: తర్లుపాడు మండలంలోని కలజువ్వలపాడులో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు పాల్గొన్నారు. 2027 జనాభా లెక్కల సేకరణను ప్రభుత్వ నిబంధనల మేరకు సమగ్రంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సెన్సెస్ విభాగం అధికారులు జనాభా లెక్కలను డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు తెలిపారు.