క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
AKP: చోడవరం మండలం జుత్తాడ గ్రామంలో పట్టాలమ్మ తల్లి పండుగ సందర్భంగా సోమవారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం బ్యాట్ పట్టుకుని క్రీడాకారులతో సరదాగా ఆడారు. పండుగల వేళ క్రీడా పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని, యువత క్రీడలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.