వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఇలా..!
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో బుధవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,300 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.22,100 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.38,100పలికింది. తేజ మిర్చి ధర రూ.19,700, ఎల్లో మిర్చి రూ.21,500 పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.