'బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి'
JGL: ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ 6 మంది అర్జీదారుల సమస్యలను నేరుగా విని, సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.