రైతులకు అందుబాటులో యూరియా

రైతులకు అందుబాటులో యూరియా

NRML: లోకేశ్వరం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మంగళవారం నుండి ఎరువులు అందుబాటులో ఉంటాయని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ రత్నాకర్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్తా యూరియా రూ.270 ఉంటుందని పేర్కొన్నారు. కావలసిన రైతులు ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని కార్యాలయానికి రావాలని కోరారు.