జూబ్లీహిల్స్ BRS అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి..?

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. BRS తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. తాజాగా బీఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో కేటీఆర్ సహా సునీత పాల్గొన్నారు. కాగా, ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నిక కోసం బీఆర్ఎస్ ఇంఛార్జ్లను నియమించింది.