గన్నవరంలో సంతకాలు చేసిన వంశీ
కృష్ణా: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ శనివారం బాపులపాడు మండలం వీరవల్లి, విజయవాడ రూరల్ మండలం పటమట పోలీస్ స్టేషన్లకు వచ్చారు. కోర్టు షరతుల్లో భాగంగా అక్కడి రిజిస్టర్లో ఆయన సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న తన అభిమానులతో మాట్లాడి, వారితో ఫొటోలు దిగారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ రాజకీయాల గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు.