విధి నిర్వహణలో జేసీవో వీరమరణం
జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో చేపట్టిన 'ఆపరేషన్ షేరీ కలాన్'లో విషాదం చోటుచేసుకుంది. అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో విధి నిర్వహణలో ఉన్న జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సుబేదార్ సందీప్ కుమార్ ప్రమాదవశాత్తు జారి పడిపోయారు. వెంటనే ఆయనను పోతాలోని మిలిటరీ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన మరణించారు.