దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి: మంద కృష్ణ
GNTR: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను నిరాకరిస్తున్న1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఇతర మతాల్లోని వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నప్పుడు దళితులకే ఎందుకు ఈ వివక్ష అని ప్రశ్నించారు. కుల వ్యవస్థ వల్లనే దేశంలో అసమానతలు పెరిగాయని, దీనికి కారణమైన శక్తులపై ఉద్యమిస్తామని హెచ్చరించారు.