పత్తికొండలో త్రయోదశి ప్రత్యేక పూజలు
KRNL: పత్తికొండలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా ఇవాళ నిర్వహించారు. పూజారి విజయ్ ఆధ్వర్యంలో నందీశ్వరుడు, రామలింగేశ్వరుడికి పంచామృత, పాలాభిషేకాలు చేశారు. అనంతరం పసుపు, కుంకుమ, గంధం, భస్మాలతో అర్చన చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.