గడువులోగా ప్రజా సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్
సత్యసాయి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పుట్టపర్తిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. క్షేత్రస్థాయికి వెళ్లి ఫిర్యాదులను పరిశీలించి, పారదర్శకంగా విచారణ జరపాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిర్ణీత గడువులోపు సంతృప్తికరంగా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు.