మూగజీవులకు తాగునీటి కష్టాలు

మూగజీవులకు తాగునీటి కష్టాలు

శ్రీరంగాపూర్ మండలంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేసవిలో మూగ జీవులకు తాగునీరు గగనమైంది. ఉపాధి హామీ పథకం కింద రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన నీటి తొట్టెలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లేక తొట్టెలన్నీ ఎండిపోవడంతో మండల కేంద్రంతో పాటు కంబలాపూర్, తాటిపాముల తదితర గ్రామాల్లో పశువులు దప్పికతో అలమటిస్తున్నాయి.