కంభం మండలంలో పొలం పిలుస్తోంది' కార్యక్రమం
ప్రకాశం: కంభం మండలంలోని కందులాపురం, రావిపాడు గ్రామాల్లో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ పాల్గొని మాట్లాడుతూ.. వరి పంటకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని, ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ. 2,389కు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.