సీఐఐ సదస్సు ద్వారా భారీ పెట్టుబడులు: డోలా
AP: సీఐఐ సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ.13.25 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా రూ.3,704 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 5 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. పెట్టుబడులు తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు.