VIDEO: భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఈవో
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నూతనంగా నిర్మిస్తున్న వకుళ మాత అన్నదానం భవన నిర్మాణ పనులను దేవస్థానం ఈవో చక్రధర్ రావు, ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం ఆలయానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో అన్నదానం చేయటానికి వచ్చిన ఇబ్బందులు దృష్ట్యా ఈ నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.