రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన
HNK: కమలాపూర్ మండలంలోని మరిపల్లి గూడెం గ్రామంలో రోడ్డు భద్రతపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. సీఐ నవీన్ మాట్లాడుతూ.. ప్రజలు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, రోడ్డు భద్రతా ప్రతి ఒక్కరి బాధ్యత అని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.