ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడోద్దు: JC
VZM: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని JC సేతుమాధవన్ హెచ్చరించారు. శుక్రవారం ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లు, నెయ్యి విక్రయదారులు, స్వీట్, కిరాణా షాపులపై ఆయన చర్యలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టి అధికారి తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడటంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నిందితులను విచారించి రూ.1,04,000 జరిమానా విధించారు.