CITU అఖిల భారత మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ
TPT: కార్మికుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా CITU 18వ అఖిల భారత మహాసభలు ఈనెల 30నుంచి జనవరి 4వతేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్నాయి. మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ చంద్రగిరి పట్టణంలో గోడపత్రిక ను ఆవిష్కరించారు. దేశ కార్మికులంతా జనవరి 4న విశాఖపట్నంలో లక్షల మందితో నిర్వహించనున్న బహిరంగ సభకు తరలిరావాలని CITU నాయకులు విజ్ఞప్తి చేశారు.