నేడు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం

నేడు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం

NGKL: వంగూర్ మండలం పరిధిలోని కొండారెడ్డిపల్లి రైతువేదికలో సోమవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ఉంటుందని మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రియదర్శిని ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భూ భారతి పోర్టల్ ప్రారంభోత్సవం గురించి ప్రత్యక్ష ప్రసారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.