రైతులకు కోసిగి ఏవో కీలక సూచన
KRNL: కోసిగి మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ కార్యాలయంలో సోమవారం రైతులకు కీలక సూచనలు చేశారు. విత్తనాలను తప్పనిసరిగా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దే కొనుగోలు చేయాలని, కొనుగోలు సమయంలో రసీదు తీసుకోవాలని సూచించారు. పంట కాలం ముగిసే వరకు బిల్లులను భద్రపరుచుకోవడం వల్ల మొలక సమస్యలు లేదా పంట ఎదుగుదల లోపాలు తలెత్తినప్పుడు చర్యలు ఉంటాయన్నారు.