మూల్యాంకనంలో తప్పులు దొర్లితే కఠిన చర్యలు: కలెక్టర్
EG: బాల విజ్ఞాన్ మందిర్ పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘా, అధికారులకు అందుతున్న వసతులపై డీఈవో వాసుదేవరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పాట్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.