రూ.6 లక్షల నిధులతో రోడ్డు మధ్యలో డివైడర్ల పనులు
ATP: గుత్తి సుందరీకరణలో భాగంగా గాంధీ చౌక్ నుంచి రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ల ఎత్తును పెంచుతూ నిర్మాణ పనులను చేపట్టారు. కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. ఈ నిర్మాణ పనులకు రూ.6 లక్షలు నిధులను కేటాయించమన్నారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పనులు పూర్తయిన వెంటనే డివైడర్ల మధ్యలో మొక్కలను ఏర్పాటు చేస్తామన్నారు.