'శ్యాం ప్రసాద్ ఆశయ సాధనలకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి'
NLR: శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు పోలిశెట్టి సుబ్బారావు తెలిపారు. సోమవారం కోవూరులో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 1951లో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జన సంగ్ పార్టీ స్థాపించి తర్వాత 1980 సంవత్సరం ఏప్రిల్ 6న బీజేపీగా అవతరించి తిరుగులేని శక్తిగా మారిందన్నారు.