'మాగంటి ఆస్తులపై రేవంత్, కేటీఆర్ కన్ను'
TG: హైదరాబాద్లోని షేక్పేటలో నిర్వహించిన BJP కార్నర్ మీటింగ్లో కేంద్రమంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. మాగంటి గోపీనాథ్ ఆస్తులపై రేవంత్, కేటీఆర్ కన్నుపడిందని తెలిపారు. గోపీనాథ్ ఆస్తులు కాజేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఫిర్యాదు చేసినా విచారణ జరపడంలేదని అనుమానం వ్యక్తం చేశారు. గోపీనాథ్ మరణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.