రాజ్ భవన్ పేరు మార్పుపై హరిబాబు స్పందన
గవర్నర్ల అధికారిక నివాసమైన రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మార్చటంపై ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు స్పందించారు. ఈ నిర్ణయం ప్రజలకు మరింత చేరువ కావడంతోపాటు పారదర్శకత, నిబద్ధతను బలోపేతం చేస్తుందన్నారు. ప్రజలతో మమేకం కావడానికి సమ్మిళిత పురోగతికి ఒక్క శక్తిమంతమైన ప్రదేశంగా లోక్భవన్ ఉంటుందని చెప్పారు. PM మోదీ దార్శనికతకు ఇదొక ఉదాహరణ అని తెలిపారు.