ఇసుక లేక నిలిచిపోతున్న ఇళ్ల నిర్మాణాలు

ఇసుక లేక నిలిచిపోతున్న ఇళ్ల నిర్మాణాలు

జన్నారం మండలంలో ఇసుక సరఫరా లేకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని ప్రజలు తెలిపారు. ట్రాక్టర్ యజమానులు, మేస్త్రీలు, కూలీలు ఉపాధి కోల్పోయారు. జన్నారం కవ్వాల్ అభయారణ్యంలో ఉండడంతో పది కిలోమీటర్ల వరకు ఇసుక సేకరణను నిలిపివేసినట్లు అటవీ అధికారులు చెప్పారు. గోదావరి తీరంలో కూడా సేకరణను నిలిపివేశారు. మండలంలో దాదాపు ఇసుక సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇంటి యజమానులు కూడా ఇబ్బంది పడుతున్నారు.