అగ్ని ప్రమాదం.. మూడెకరాల జొన్న పంట దగ్ధం

అగ్ని ప్రమాదం.. మూడెకరాల జొన్న పంట దగ్ధం

KMR: గాంధారి మండలం తిప్పారం శివారులో గురువారం జొన్న పంటకు నిప్పంటుకొని మూడెకరాల పంట దగ్ధమైంది. మంజు నరేందర్‌కు చెందిన జొన్న పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.