ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపాన ఉన్న శ్రీ విరుపాక్షి మారెమ్మ సోమవారం ప్రత్యేక పూజలు అందుకున్నారు. అర్చకులు అమ్మవారి మూలవిరాట్కు పలు రకాల పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం పసుపు, కుంకుమ, మల్లె, రోజా, చామంతి పుష్పమాలలతో అమ్మవారిని అలంకరించారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.