ప్రారంభమైన రెండో విడత పోలింగ్
JGL: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జగిత్యాల అర్భన్, రూరల్, సారంగపూర్, రాయికల్, బీర్పూర్, మల్యాల, కొడిమ్యాల మండలాల పరిధిలోని 134 గ్రామ పంచాయతీలు, 2275 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్కు అవకాశం ఉంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.