VIDEO: జనగామ బస్ స్టాండ్లో చెయిన్ స్నాచింగ్
JN: జనగామ జిల్లా కేంద్రాల్లోని బస్ స్టాండ్లో ఇవాళ చెయిన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. పైసా కిష్టమ్మ అనే మహిళ బస్ ఎక్కుతుండగా ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.