వైసీపీ నాయకుడు అకస్మాత్తుగా మృతి
NDL: అవుకు మండలం చిన్న కొట్టాల గ్రామ వైసీపీ నాయకుడు ఏరాశి జనార్దన్ రెడ్డి మంగళవారం అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చిన్న కొట్టాల గ్రామానికి చేరుకుని వైసీపీ నాయకుడు మృతదేహాన్ని సందర్శించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.