VIDEO: 'సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి'

KMM: సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ అన్నారు. శుక్రవారం సత్తుపల్లి మండలం గంగారం పల్లె దవాఖానను ఆయన పార్టీ నేతలతో కలిసి సందర్శించారు. పల్లె దవాఖానలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్డబ్ల్యూఎస్ పరిసరాలను పరిశీలించారు.