ఈనెల 19న సామూహిక అక్షరాభ్యాసం
CTR: కాణిపాకంలో ఈనెల 19న సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్షయ తృతీయ సందర్భంగా ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు దేవస్థాన ఆస్థాన మండపంలో కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఇందులో పాల్గొనేవారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.