సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్
PDPL: తెలంగాణ భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్- 2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం తెలిపారు. స్వాతంత్య్రానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి సలహాలు, సూచనల కోసం ఈ సర్వేను చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.