ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్
NRML: కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, చీఫ్ ఎలెక్టోరల్ కార్యాలయ ఈవీఎం రాష్ట్ర నోడల్ అధికారి బీ. హరిసింగ్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. పోలీసు సిబ్బంది నిరంతరం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.