రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
PPM: తగరపువలస జాతీయ రహదారిపై అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో బీటెక్ విద్యార్థి జొన్నపల్లి ధరన్ శ్రీ (18) మృతి చెందాడు. సంగివలసలో చదువుతూ హాస్టల్లో ఉంటున్న అతను రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. భీమిలి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదమా, ఆత్మహత్యా అనేది విచారిస్తున్నారు.