రక్తదానం చేసిన రామగుండం ఎమ్మెల్యే

పెద్దపల్లి: గోదావరిఖని ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శనివారం స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయటానికి యువత ముందుకు రావాలని సూచించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు.