మరో దేశంలో సోషల్ మీడియా బ్యాన్
16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ఇండోనేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, టిక్టాక్, ఎక్స్ వంటి సోషల్ మీడియాల్లో చిన్నారులు అకౌంట్లను తెరిచేందుకు వీలులేదంటూ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీంతో ఆగ్నేయాసియాలో చిన్నారుల SM వినియోగంపై ఆంక్షలు తీసుకువచ్చిన మొదటి దేశంగా ఇండోనేషియా నిలిచింది.