బీహార్కు బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నుంచి బీహార్ బయల్దేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'ఓటర్ అధికార యాత్ర'లో వీరు పాల్గొననున్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ కూడా వారితోపాటు వెళ్లారు. ఈ యాత్రలో రాష్ట్ర నేతలు కీలక పాత్ర పోషించనున్నారు.