నగరపాలక సంస్థ అదనపు కమిషనర్కు పదోన్నతి

కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్కు స్పెషల్ గ్రేడ్ కమిషనర్గా పదోన్నతి లభించింది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వుల్లో పలువురికి పదోన్నతులు కల్పించారు. అందులో సుధాకర్ కూడా ఉన్నారు. ఆయన పదోన్నతితో ఇక్కడే అదనపు కమిషనర్గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.