పేకాట శిబిరంపై దాడి.. 9 మంది అరెస్ట్
W.G: మొగల్తూరు మండలం దారితిప్ప (జగన్నాధపురం) గ్రామ శివారులో శుక్రవారం పీకాట స్థావరంపై పోలీసులు దాడి చేసినట్లు ఎస్సై వై. నాగలక్ష్మి తెలిపారు. ఈ దాడిలో 9 మందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. వారి నుంచి రూ.25,660 నగదు, 52 పేక ముక్కలు, 112 కాయిన్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చెప్పారు.