తొలగింపు పనులను అడ్డుకున్న గ్రామస్తులు

తొలగింపు పనులను అడ్డుకున్న గ్రామస్తులు

AKP: అచ్యుతాపురం మండలం దుప్పితూరులో బ్రాండిక్స్ కంపెనీ యాజమాన్యం ల్యాండ్ లెవెలింగ్ పేరుతో రైతుల పాకలు, చెట్లను దౌర్జన్యంగా తొలగించే పనులను గ్రామస్తులు శనివారం అడ్డుకున్నారు. పూర్తిగా నష్ట పరిహారాన్ని మంజూరు చేసి, గ్రామాన్ని ఇక్కడి నుంచి తరలించిన తరువాతే పనులు చేపట్టాలని గ్రామస్తులు అడ్డుతగిలారు. కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ప్రజలు తెలిపారు.