'లబ్ధిదారులు రిజిస్ట్రేషన్, మార్టిగేజ్ పూర్తి చేసుకోవాలి'
కృష్ణా: టిడ్కో ప్లాట్లు కేటాయించిన లబ్ధిదారులు తప్పనిసరిగా ప్లాట్ రిజిస్ట్రేషన్తో పాటు మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ మంగళవారం సూచించారు. లబ్ధిదారుల సౌకర్యార్థం గుడివాడ కైకాల కళామందిరంలో ప్రత్యేక రిజిస్ట్రేషన్ సెల్ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. గడువులోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.