పొగాకు రైతులకు నిర్వహణ అధికారి సూచనలు

ప్రకాశం: పొగాకు రైతులకు పొదిలి పొగాకు వేలం నిర్వహణ అధికారి గొంగటి గిరిరాజ్ కుమార్ సూచనలు చేశారు. పొదిలి పొగాకు వేలం కేంద్రంలో బ్యారన్లకు ఈనెల 18 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. పొగాకు బ్యారన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మూడేళ్లకు ఓసారి రిజిస్ట్రేషన్ చేసే పద్ధతిని రైతులు గమనించాలని కోరారు.