కరీంనగర్ DRDO బదిలీ
KNR: కరీంనగర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి (DRDO) వి.శ్రీధర్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సిరిసిల్లలో పనిచేస్తున్న మచ్చ గీతను కరీంనగర్ జిల్లాకు కేటాయిస్తూ పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ బదిలీలను చేపట్టినట్టు తెలిపారు.